
ఉమ్మడి జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
● 14 నుంచి పులివెందులలో రాష్ట్ర స్థాయి పోటీలు
సామర్లకోట: కడప జిల్లా పులివెందులలో ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు జరిగే 34వ సబ్ జూనియర్స్ రాష్ట్ర స్థాయి బాల, బాలికల కబడ్డీ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్లను ఆదివారం స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో ఎంపిక చేశారు. కాకినాడ, రాజమహేంద్రవరం, కిర్లంపూడి, సామర్లకోట, ప్రతిపాడు, పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం, రామచంద్రపురం మండలాల నుంచి బాలుర విభాగం నుంచి 40 మంది, బాలికల విభాగం నుంచి 25 మంది ఎంపికకు హాజరయ్యారు. ప్రతిభ ఆధారంగా బాలుర జట్టును నిమ్మకాయల కిరణ్, పవన్ కుమార్, బాలికల జట్టును ఎన్.శ్వేత, డి.దేవికుమారి ఎంపిక చేశారు
బాలబాలికల జట్లు ఇవే..
ఉమ్మడి జిల్లా బాలికల జట్టులో ఎంవీ దుర్గామహాలక్ష్మి, ఎస్.భవాని, టి.మహేశ్వరి, బీఎం వరలక్ష్మి, సీహెచ్వీఆర్పీ దుర్గాభవాని, డి.దివ్యశ్రీ, ఎ.లోకిభవాని, సీహెచ్ఎల్ ప్రత్యూష, ఎంఎల్వీ దుర్గ, జి.శిరీష, వర్షిణి ఉన్నారు. అదేవిధంగా బాలుర జట్టులో జి.త్రిమూర్తులు, జి.నరేష్, సీహెచ్ఎన్కే రెడ్డి, కె.అభిరామ్, కె.ప్రవీణ్కుమార్, సీహెచ్పీవీవీఎస్ శ్రీహర్ష, వి.సత్యచరణ్, వై.సామ్రాట్, జి.వీరబాబు, ఎం.దుర్గాప్రసాదరావు ఎంపికయ్యారు. ప్రొ కబడ్డీ అంపైర్ బోగిళ్ల మురళీకుమార్, కబడ్డీ సంఘ ప్రతినిధులు పర్యవేక్షించారు.

ఉమ్మడి జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక