కొత్తపేట: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) బాలికల విభాగం జిల్లా సెక్రటరీగా మండలంలో పలివెల జెడ్పీ హైస్కూలు పీడీ య ర్రంశెట్టి శేషసత్య ఉషారాణి నియమితులయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఉషారాణి శనివారం తెలిపారు. ఖో–ఖో క్రీడలో 8 సార్లు జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారిణి అయిన ఉషారాణి వ్యాయామ ఉపాధ్యాయినిగా 1996లో సర్వీస్లో చేరారు. ఆమెను ఎంఈఓలు మట్టపర్తి హరిప్రసాద్, కే లీలావతి, పలివెల పాఠశాల హెచ్ఎం ఇందిరాబాయి తదితరులు అభినందించారు.


