నిజామాబాద్‌ జిల్లాలో విషాదం.. వడదెబ్బ ధాటికి యువతి మృతి

Young Woman Dies Of Summer Sunstroke At Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండల ధాటికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా.. ఎండదెబ్బతో నిజామాబాద్ జిల్లాలో ఓ యువతి మృతి చెందింది. డిచ్‌పల్లి మండలం లింగసముద్రం గ్రామానికి చెందిన చిన్నోళ్ల సవిత(19) వడదెబ్బకు మృత్యువాత పడటం ఆ గ్రామంలో విషాదం రేపింది. వడదెబ్బ కారణంగా అనారోగ్యానికి గురైన సవితను ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. కాగా, జిల్లావ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉంది. గత వారం రోజుల నుంచి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top