ప్రియురాలి కండిషన్‌.. ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని..  

Young Man Commits Suicide Over Love Problems In Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి క్రైం: ప్రేమించిన అమ్మాయి దక్కదేమోననే బెంగతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. పట్టణంలని స్నేహపూరి కాలనీలో నివాసం ఉండే పోలబోయిన లలితకు అఖిల్‌ (20), నిఖిల్‌ అనే కవల పిల్లలు ఉన్నారు. వారిలో పెద్దవాడైన అఖిల్‌ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా.. ఇటీవలే ఉద్యోగం మానేసి ఇంటి వద్ద ఉంటున్నాడు.

చాలా రోజులుగా విద్యానగర్‌ కాలనీకి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలని అమ్మాయి చెప్పినట్లు తెలిసింది. దీంతో ప్రియురాలు దక్కదేమోనని మనస్థాపం చెందాడు. అనారోగ్య కారణాలతో తల్లి బంధువుల ఇంటికి ఆదివారం వెళ్లింది. సోమవారం ఉదయంఇంటికి వచ్చి చూడగా బెడ్‌రూంలో ఫ్యాన్‌కు అఖిల్‌ చున్నీతో ఉరివేసుకుని ఉన్నాడు. మృతుడి తల్లి లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్‌ తెలిపారు.  

ఫెయిల్‌ అయ్యానని యువతి ఆత్మహత్య 
కామారెడ్డి క్రైం: పరీక్షలో ఫెయిల్‌ కావడంతో నర్సింగ్‌ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఇస్రోజివాడి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దుబ్బాక శిరీష (19) నిజామాబాద్‌ జిల్లా ధర్మారంలోని తిరుమల నర్సింగ్‌ కళాశాలలో ఇటీవల జీఎన్‌ఎం పూర్తి చేసింది. పరీక్షా ఫలితాల్లో కొన్ని సబ్జెక్టులు తప్పాయని ఆమెకు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన శిరీష ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి చిన్న పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దేవునిపల్లి ఎస్సై ప్రసాద్‌ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top