Tamil Nadu Crime: ఓటీపీ చెప్పలేదని భార్య, పిల్లల ఎదుటే..

Tamil Nadu: Cab Driver Arrested For Attack Passenger To Death Over Otp Issue - Sakshi

ప్రయాణికున్ని కొట్టి చంపిన క్యాబ్‌డ్రైవర్‌

భార్య, పిల్లల కళ్లెదుటే దారుణం

సాక్షి, చెన్నై: వాహన బుకింగ్‌కు సంబంధించి ఓటీపీ నంబర్‌ తెలియజేయక పోవడంతో ఓ క్యాబ్‌డ్రైవర్‌ భార్య, పిల్లల ఎదుటే కొట్టి మరీ ఓ ప్రయాణికున్ని చంపేసిన ఘటన ఆదివారం రాత్రి  చోటు చేసుకుంది. చెన్నై శివారులోని గూడువాంజేరి సమీపంలోని కన్నివాక్కం కుందన్‌నగర్‌లో ఉంటున్న ఉమేందర్‌(33) కోయంబత్తూరులోని ఓ ప్రముఖ సంస్థలో ఐటీ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. ప్రతి శని, ఆదివారం చెన్నైకు వచ్చి కుటుంబంతో గడుపుతాడు. ఆదివారం ఉమేందర్‌ భార్య భవ్య(30), పిల్లలు అక్రోష్, కరన్‌తో పాటు భవ్య సోదరి దేవిప్రియ, ఆమె పిల్ల లతో కలిసి ఓఎంఆర్‌ రోడ్డులోని సినీ కాంప్లెక్స్‌లో సినిమాకు వెళ్లారు.

అనంతరం ఇంటికి వెళ్లడానికి దేవిప్రియ క్యాబ్‌ బుక్‌ చేసింది. కారు ఎక్కాక డ్రైవర్‌ రవి బుకింగ్‌ ఓటీపీ నంబర్‌ చెప్పాలని కోరాడు. ఈ విషయమై వారి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. కారు దిగే సమయంలో ఉమేందర్‌ డోర్‌ను గట్టిగా నెట్టడంతో రవి దాడి చేశాడు. దీంతో అతను స్పృహ తప్పాడు. అయితే డ్రైవర్‌ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా కేలంబాక్కం పోలీసులు అరెస్టు చేశారు. స్పృహ తప్పిన ఉమేందర్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు  తెలిపారు.

చదవండి: అతి పిన్న వయసులో కంప్యూటర్‌ భాషలను నేర్చుకున్న చిచ్చర పిడుగు!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top