విజయనగరంలో విషాదం.. గురుకులంలో పిల్లలను కాటేసిన పాము | Snake Bite In Gurukul School Vizianagaram | Sakshi
Sakshi News home page

నిద్రలో పిల్లల్ని కాటేసిన విషసర్పం.. విజయనగరం గురుకులంలో విషాదం

Mar 4 2022 12:46 PM | Updated on Mar 4 2022 12:46 PM

Snake Bite In Gurukul School Vizianagaram - Sakshi

గాఢ నిద్రలో ఉన్న పిల్లల్ని కాలసర్పం కాటేసింది. ఘటనలో ఒక విద్యార్థి మృతిలో 

సాక్షి, విజయనగరం: జిల్లాలోని కురుపాం బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో విషాదం నెలకొంది.  నిద్రలో ఉన్న విద్యార్థుల్ని విష సర్పం ఒకటి కాటేసింది.  ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం జరిగింది.  నిద్రిస్తున్న విద్యార్థుల ముఖంపై పాము కాటేసింది. దీంతో పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషయం తెలిసిన సిబ్బంది, స్థానికులు పామును అక్కడికక్కడే చంపేశారు. విద్యార్థుల్ని పార్వతీపురంలోని ఓ ఆస్పత్రికి తరలించి.. ఆపై మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తీసుకెళ్లారు.

ముగ్గురిలో రంజిత్‌ అనే చిన్నారి మృతి చెందాడు. మరో ఇద్దరిలో ఓ చిన్నారి వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన గురించి తల్లిదండ్రుల్లో ఆందోళన  నెలకొనగా.. రంజిత్‌ కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement