ఇంటిపని అని చెప్పి.. వ్యభిచార కూపంలోకి దింపారు | Police Bust Prostitution Racket In Tamilnadu | Sakshi
Sakshi News home page

ఇంటిపని అని చెప్పి.. వ్యభిచార కూపంలోకి దింపారు

Jan 31 2022 7:35 AM | Updated on Jan 31 2022 10:01 PM

Police Bust Prostitution Racket In Tamilnadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై (తమిళనాడు): ఇళ్లల్లో పని పేరిట త్రిపుర రాష్ట్రానికి చెందిన నలుగురు బాలికలను తీసుకొచ్చి.. ఓ ముఠా వ్యభిచార కుంపంలో దించి చిత్ర హింసలకు గురి చేసింది. ఈ ఘటన చెన్నైలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. త్రిపుర రాష్ట్రం శివజాల ప్రాంతానికి చెందిన సలీమా ఖదున్‌(38) అక్కడి బాలికలు, యువతులకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి బెంగళూరు, చెన్నైకు పంపిస్తోంది.

ఈ క్రమంలో త్రిపురకు చెందిన నాలుగురు బాలికల్ని తొలుత ఓ బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం నిమిత్తం పంపించింది. కొన్నాళ్లు అక్కడున్న ఆ బాలికల్ని చెన్నైకు తరలించారు. ఈనెల 17వ తేదీ చెన్నై శివారులోని కేలంబాక్కం పడూర్‌లోని ఓ నివాసంలో ఈ బాలికల్ని ఉంచారు. అక్కడ అలావుద్దీన్, మైదీన్, అన్వర్, హుస్సేన్‌ అనే నలుగురు వ్యక్తులు బాలికలను చిత్రహింసలకు గురి చేయడం మొదలెట్టారు.

ఈసీఆర్‌ మార్గంలోని కొన్ని రిసార్టులకు పంపించి బలవంతంగా వ్యభిచార కుంపంలోదించారు. ఈనెల 26న వారి నుంచి తప్పించుకున్న ఓ 16 ఏళ్ల బాలిక గస్తీ పోలీసుల్ని ఆశ్రయించింది. ప్యారిస్‌ పోలీసులు ఆ నలుగురి బాలికల్ని రక్షించారు. అయితే, ఆ మహిళతో పాటుగా ముఠా సభ్యులు మాత్రం తప్పించుకున్నారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా బాధిత బాలికలను త్రిపురకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.   

విద్యార్థిని ఆత్మహత్య 
పళ్లిపట్టు: ప్లస్‌టూ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆర్కేపేట పోలీసులు కథనం మేరకు బాలాపురం గ్రామానికి చెందిన  స్నేహ(17) స్థానికంగా ఉంటున్న  ప్రభుత్వ మహాన్నత పాఠశాలలో ప్లస్‌టూ చదువుతోంది. ఈ బాలిక తల్లిదండ్రులు ఐదేళ్ల కిందట మృతి చెందడంతో అత్తమ్మ మునియమ్మ వద్ద ఉంటోంది. స్నేహ పేరిట దాదాపు రూ.2 కోట్ల విలువైన ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో స్నేహకు వివాహం చేసేందుకు అత్త మునియమ్మ నిర్ణయించినట్లు సమాచారం. కాగా వివాహంపై ఆసక్తి లేని స్నేహ  ఇంట్లో ఒంటిరిగా ఉంటున్న సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement