కాలితో తన్నిన ఆఫీసర్‌.. యాచకుడి దుర్మరణం | Nizamabad: Beggar died in Road Accident Due | Sakshi
Sakshi News home page

ఆర్మూర్‌లో దారుణం: కాలితో తన్నిన డిప్యూటీ తహసీల్దార్‌.. యాచకుడి దుర్మరణం

Feb 24 2024 10:33 AM | Updated on Feb 24 2024 1:13 PM

Nizamabad: Beggar died in Road Accident Due - Sakshi

సాక్షి, ఆర్మూర్‌:  ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆగ్రహంతో యాచకుడుని తన్నడంతో టిప్పర్‌ కింద పడి దుర్మణం చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. సీసీ కెమెరాల ఫుటేజీలో ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. 

పోలీసుల కథనం ప్రకారం.. మెండోర డిప్యూటీ తహసీల్దార్‌ రాజశేఖర్‌ కారులో ఆర్మూర్‌ వెళ్తున్న క్రమంలో మామిడిపల్లి చౌరస్తాలో సిగ్నల్‌ పడటంతో వాహనాన్ని నిలిపారు. అదే సమయంలో ఆర్మూర్‌లోని టీచర్స్‌ కాలనీకి చెందిన శివరాం(32) కారు అద్దాలను తుడిచి డబ్బులు ఇవ్వాలని కోరగా, రాజశేఖర్‌ లేవని బదులిచ్చారు. గ్రీన్‌ సిగ్నల్‌ పడటంతో వాహనాన్ని ముందుకు కదిలించడంతో శివరాం డబ్బుల కోసం కారును వెంబడించాడు. 

కోపంతో ఊగిపోయిన డీటీ రాజశేఖర్‌ కారు దిగి.. యాచకుడిని కాలుతో తన్నడంతో ఆ పక్క నుంచి వెళ్తున్న టిప్పర్‌ వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు రాజశేఖర్‌ను బాధ్యుడిగా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఠాణాకు వచ్చి న్యాయం చేయాలని ఆందోళన చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్‌ వెల్లడించారు. 

Video Credits: Telugu Scribe

Advertisement
 
Advertisement
Advertisement