భిక్షాటన చేసుకునే దివ్యాంగుడిపై పోలీసుల దాడి | Police Assault on Disabled Beggar Sparks Outrage In Vijayawada | Sakshi
Sakshi News home page

భిక్షాటన చేసుకునే దివ్యాంగుడిపై పోలీసుల దాడి

Apr 24 2026 9:12 PM | Updated on Apr 24 2026 9:15 PM

Police Assault on Disabled Beggar Sparks Outrage In Vijayawada

విజయవాడ: అతను భిక్షగాడే కాదు.. దివ్యాంగుడు కూడా. అవేమీ పోలీసులకు కనిపించలేదు. అతన్ని చితక బాదారు. వాతలు తేలేలా కొట్టారు పోలీసులు. ఇదెక్కడో కాదు. ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై.   ఆ దివ్యాంగ భిక్షగాన్ని కొట్టింది ఇంద్రకీలాద్రి ఔట్‌పోస్ట్‌ పోలీసులు.

బ్రహ్యం అనే వ్యక్తి భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దివ్యాంగుడైన అతను ఇంద్రకీలాద్రిపై భిక్షాటన చేసుకుంటుండగా పోలీసులు అతన్ని చితక్కొట్టారు. అతను అయ్యప్ప మాలలో సైతం ఉన్నాడు. 

ఓ భిక్షగాడిని, అందులోనూ దివ్యాంగుడైన అతన్ని అంతలా కొట్టాల్సిన అవసరం లేకపోయినా పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. కర్రలతో వాతలు తేలేలా కొట్టడంతో చేసేది లేక మళ్లీ పోలీసులకే ఫిర్యాదు చేశాడు. విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు.
 



 

Advertisement
 
Advertisement
Advertisement