విజయవాడ: అతను భిక్షగాడే కాదు.. దివ్యాంగుడు కూడా. అవేమీ పోలీసులకు కనిపించలేదు. అతన్ని చితక బాదారు. వాతలు తేలేలా కొట్టారు పోలీసులు. ఇదెక్కడో కాదు. ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై. ఆ దివ్యాంగ భిక్షగాన్ని కొట్టింది ఇంద్రకీలాద్రి ఔట్పోస్ట్ పోలీసులు.
బ్రహ్యం అనే వ్యక్తి భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దివ్యాంగుడైన అతను ఇంద్రకీలాద్రిపై భిక్షాటన చేసుకుంటుండగా పోలీసులు అతన్ని చితక్కొట్టారు. అతను అయ్యప్ప మాలలో సైతం ఉన్నాడు.
ఓ భిక్షగాడిని, అందులోనూ దివ్యాంగుడైన అతన్ని అంతలా కొట్టాల్సిన అవసరం లేకపోయినా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. కర్రలతో వాతలు తేలేలా కొట్టడంతో చేసేది లేక మళ్లీ పోలీసులకే ఫిర్యాదు చేశాడు. విజయవాడ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు.


