వసతి గృహాలకు పలువురి తరలింపు
హైదరాబాద్: నగరంలోని యాచకులకు షెల్టర్ హోమ్స్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో బెగ్గర్స్ రిహాబిలిటేషన్ కల్పించారు. నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టేషన్లు, ప్రధాన చౌరస్తాలు, దేవాలయ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 107 మంది యాచకులను గుర్తించారు. వీరిలో 37 మందిని చౌటుప్పల్ సమీపంలోని అమ్మా– నాన్న అనాథాశ్రమానికి తరలించారు. మరో 40 మందిని జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ షెల్టర్ హోమ్స్లో చేరి్పంచారు. మిగతా వారికి కౌన్సెలింగ్ ఇచ్చి స్వస్థలాలకు పంపించినట్టు అధికారులు తెలిపారు.


