పిల్లలను ఇంట్లో వదిలి వివాహిత అదృశ్యం | Married Woman Missing In Thungathurthi Nalgonda | Sakshi
Sakshi News home page

పిల్లలను ఇంట్లో వదిలి వివాహిత అదృశ్యం

Nov 23 2021 8:23 AM | Updated on Nov 23 2021 8:24 AM

Married Woman Missing In Thungathurthi Nalgonda - Sakshi

సాక్షి, తిరుమలగిరి (తుంగతుర్తి) : పిల్లలను ఇంట్లోనే వదిలి వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన తిరుమలగిరిలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన పాము సరిత ఈ నెల 18వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి రాలేదు. సరితకు 11సంవత్సరాల కూతురు, ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె భర్త పి.మహేష్‌ బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొబేషనరీ ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement