మన్యంలో మావోయిస్టుల ఘాతుకం | Maoist Assassinated Adivasi Man Claiming Informer | Sakshi
Sakshi News home page

మన్యంలో మావోయిస్టుల ఘాతుకం

Dec 14 2020 4:37 PM | Updated on Dec 14 2020 5:21 PM

Maoist Assassinated Adivasi Man Claiming Informer - Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని సింహాచలం ప్రాంతంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్ఫార్మర్‌గా అనుమానించి గెమ్మెలి కృష్ణారావు అనే గిరిజనుడిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన జి.మాడుగుల మండలం వాక పల్లె గ్రామం సోమవారం జరిగింది. కృష్ణారావును హత్య చేసి మావోయిస్టులు అక్కడ ఒక లేఖనును వదిలి వెళ్లారు. ఏ పాపం ఎరుగని తన భర్తను ఈ తెల్లవారుజామున ఇంటి నుంచి ఇద్దరు మావోయిస్టులు లాక్కెళ్లి, చంపేశారని మృతుని భార్య భోరున విలపించింది. ముక్కుపచ్చలారని తన ముగ్గురు పిల్లలు, తాను అనాధగా మిగిలిపోయామని కన్నీరుమున్నీరైంది. కాగా, ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు హతమార్చిన గంటల వ్యవధిలోనే ఇన్ఫార్మర్ పేరిట గిరిజనుడిని హతమార్చడంతో మన్యంలో అలజడి మొదలైంది. పోలీసు ఇన్ఫార్మర్లుగా ఉంటూ ఆదివాసీల హక్కుల్ని కాలరాస్తున్నారని, కృష్ణారావు వైఖరిపై మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement