చెరువులో విషప్రయోగం.. లక్షల్లో చేపలు మృత్యువాత | Jangaon: Fish Found Dead In Veldi Pond Due To Suspected Poisoning | Sakshi
Sakshi News home page

రూ.లక్షకు పైగా నష్టం.. మత్య్సకారుల గగ్గోలు

May 22 2021 8:22 AM | Updated on May 22 2021 8:27 AM

Jangaon: Fish Found Dead In Veldi Pond Due To Suspected Poisoning - Sakshi

మృతి చెందిన చేపలను చూపిస్తున్న మత్య్సకారులు

రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని వెల్ది బుడమాయి చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేశారు. దీంతో రూ.లక్షకు పైగా విలువైన చేపలు మృత్యువాత పడ్డాయని ముదిరాజ్‌ కులస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ చెరువులో ముదిరాజ్‌ కులస్తులు చేపలు పడుతూ జీవనం సాగిస్తుండగా, శుక్రవారం ఉదయాన్నే వందలాదిగా చేపలు చనిపోయి ఒడ్డుకు వస్తుండడాన్ని గుర్తించారు.

ఈ సందర్భంగా ముదిరాజ్‌ కుల పెద్ద ఆళ్ల కొమురయ్య మాట్లాడుతూ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో రూ.లక్షకు పైగా విలువైన చేపలు మృత్యువాత పడ్డాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చెరువు చైర్మన్‌ ఆళ్ల గట్టయ్యతో పాటు కావాటి దానయ్య, కావాటి నాగరాజు, రాజు, లింగరాజు, బోయిని కృష్ణ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement