జైషే ఉగ్ర కుట్ర భగ్నం | India 75th independence day: Jaish module planning to disrupt I-Day celebrations busted in jammu kashmir | Sakshi
Sakshi News home page

జైషే ఉగ్ర కుట్ర భగ్నం

Aug 15 2021 3:05 AM | Updated on Aug 15 2021 6:57 AM

India 75th independence day: Jaish module planning to disrupt I-Day celebrations busted in jammu kashmir - Sakshi

జమ్మూ: స్వాతంత్రదినోత్సవం రోజునే బైక్‌బాంబును పేల్చి విధ్వంసం సృష్టించాలన్న జైషే మొహమ్మద్‌ ఉగ్రసంస్థ పన్నాగాన్ని భద్రతాబలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. జమ్మూ జిల్లా కేంద్రంలో బాంబు పేలుడుకు సిద్ధమైన నలుగురు జైషే ఉగ్రవాదులు, వారికి సాయపడిన ఉత్తరప్రదేశ్‌ వాసిని, వారి సహాయకులను పోలీసులు అరెస్ట్‌చేశారు. డ్రోన్ల ద్వారా అందే ఆయుధాలను తోటి ఉగ్రవాదులకు చేరవేసే పనిలో బిజీగా ఉండగా వీరిని అరెస్ట్‌చేశారు. అయోధ్య రామజన్మభూమిపై నిఘా పెట్టాలని, దాడికి సంబంధించిన ఆయుధాలను అమృత్‌సర్‌లో డ్రోన్‌ ద్వారా అందుతాయని, పాక్‌లోని ఉగ్రవాది.. యూపీకి చెందిన సోనూ ఖాన్‌ అనే వ్యక్తిని ఆదేశించాడు. ఆ పని పూర్తిచేసేలోపే పోలీసులు ఖాన్‌ను అరెస్ట్‌చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement