పక్కా ప్లాన్‌.. భార్యకు మద్యం తాగించి దారుణం | Husband Assassinated His Wife At Lalapet Hyderabad | Sakshi
Sakshi News home page

పక్కా ప్లాన్‌.. భార్యకు మద్యం తాగించి దారుణం

Mar 30 2021 8:10 AM | Updated on Mar 30 2021 10:36 AM

Husband Assassinated His Wife At Lalapet Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భార్య సౌందర్యకు విడాకులు ఇవ్వాలని దర్శన్‌ నిర్ణయించుకున్నాడు. అయితే పెద్దల జోక్యంతో కలిసి ఉంటున్నారు.

లాలాపేట: కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ భర్త. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం.. సీతాఫల్‌మండి పార్టీవాడకు చెందిన శకత్వాల దర్శన్‌ ఈసీఐఎల్‌లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య సౌందర్య(25), ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్లది ప్రేమ వివాహం. వీరికి మద్యం తాగే అలవాటు ఉంది. కొంత కాలంగా ఇద్దరూ తరచూ గొడవపడుతూ ఉన్నారు.

భార్య సౌందర్యకు విడాకులు ఇవ్వాలని దర్శన్‌ నిర్ణయించుకున్నాడు. అయితే పెద్దల జోక్యంతో కలిసి ఉంటున్నారు. గత వారం రోజుల నుంచి సౌందర్య భర్త దర్శన్‌తో గొడవపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను ఎలాగైన చంపాలని నిర్ణయించుకున్న దర్శన్‌ మధ్యహ్నం పథకం ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో సౌందర్యను టవల్‌ సాయంతో గొంతు బిగించి హతమార్చాడు. నేరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
(చదవండి: మైనర్‌ బాలికతో ప్రేమ.. ఆపై పురుగుల మందు తాగి!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement