మంత్రి తలసాని కుమారుడిపై కేసు నమోదు

Case Filed Against Minister Talasani Son Over Car Accident - Sakshi

సాక్షి, ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌): మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుమారుడు తలసాని సాయికిరణ్‌ యాదవ్‌పై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలివీ... ఖైరతాబాద్‌లో శుక్రవారం రాత్రి జరిగిన సదర్‌ ఉత్సవాలకు హాజరయ్యేందుకు మంత్రి తనయుడు తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ తన కారులో వస్తున్నారు.

ఈ క్రమంలో రైల్వే గేటు సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నడుచుకుంటూ వెళ్లున్న ఇందిరానగర్‌కు సంతోష్‌(32) ఎడమ పాదం పైనుంచి మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న కారు టైరు వెళ్లింది. ఈ ఘటనలో సంతోష్‌ గాయపడ్డాడు. ఆయనను వెంటనే కిమ్స్‌ హాస్పిటల్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కారు నడుపుతున్న తలసాని సాయికిరణ్‌ యాదవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సైఫాబాద్‌ పోలీసులు తెలిపారు.   

చదవండి: (నేను జయలలిత కుమార్తెనే.. అమ్మ కంటే ఆస్తి పెద్దది కాదు: జయలక్ష్మి) 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top