వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట | Sakshi
Sakshi News home page

వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట

Published Tue, Oct 26 2021 9:05 PM

Bombay High Court: Activist Varavara Rao Bail Extended Till November 18 - Sakshi

ముంబై: ఎల్గార్‌ పరిషత్‌–మావోయిస్టులతో లింకు కేసులో మధ్యంతర బె యిల్‌పై ఉన్న విప్లవ కవి వరవరరావు(82)కు బాంబే హైకోర్టు ఊరట కల్పించింది. నవంబర్‌ 18వ తేదీ వరకు తలోజా జైలు అధికారులకు ఆయన లొంగిపోవాల్సిన అవసరం లేదని తెలిపింది. వరవరరావు వేసిన పిటిషన్‌పై విచారణను వచ్చే నెలకు వా యిదా వేసింది.

అనారోగ్య కారణాలతో తలోజా జైలులో ఉన్న వరవరరావుకు బాంబే హైకో ర్టు ఫిబ్రవరి 22వ తేదీన ఆరు నెలల మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. ఆయన సెప్టెంబర్‌ 5వ తేదీన తిరిగి కస్టడీకి వెళ్లాల్సి ఉంది. బెయిల్‌ను పొడిగించాలంటూ ఆయన వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. బెయిల్‌పై ఉండగానే హైదరాబాద్‌ వెళ్లాలన్న వినతిపై వేరుగా పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది.

Advertisement
Advertisement