సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం: సంగం డెయిరీకి చెందిన ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా సొంత ట్రస్ట్కు ఎందుకు మళ్లించారని సంబంధిత కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ప్రశ్నించారు. ‘రూ.కోట్ల విలువైన డెయిరీ ఆస్తులను కాజేసేందుకు పథకం ప్రకారం పోర్జరీ పత్రాలు సృష్టించింది నిజం కాదా? మీరు చేసిన అక్రమాల్లో ఎవరికి ఎటువంటి లబ్ధి కలగజేశారు? విచారణలో వాస్తవాలు చెప్పి కేసు దర్యాప్తునకు సహకరించండి’ అంటూ ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. విజయవాడ గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో శనివారం ఈ విచారణ సాగింది. సంగం డెయిరీ అక్రమాల కేసులో లోతైన దర్యాప్తుకోసం రిమాండ్లో ఉన్న ఏ1, ఏ2, ఏ3 నిందితులు ధూళిపాళ్ల, గోపాలకృష్ణన్, గురునాథంలను ఐదురోజులపాటు తమ కస్టడీకివ్వాలని ఏసీబీ కోరగా.. కోర్టు అనుమతివ్వడం తెలిసిందే. దీంతో ఏసీబీ అధికారులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణ, గురునాథంలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ముందు జాగ్రత్తచర్యగా ముగ్గురు నిందితులకు పీపీఈ కిట్లు వేసి విజయవాడ తీసుకొచ్చారు.
ఏసీబీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విచారణ నిర్వహించారు. డెయిరీభూములను ట్రస్ట్కు మళ్లించటం, ఫోర్జరీ పత్రాలు సృష్టి అనే కీలక అంశాలపై పలు ప్రశ్నలు సంధించారు. నిందితులు ముగ్గురూ మితంగానే బదులిచ్చినట్టు సమాచారం. నిందితుల విచారణ సందర్భంగా విజయవాడ ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. ధూళిపాళ్ల నరేంద్రను కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులు వచ్చారు. ఆయన్ను కలిసేందుకు అనుమతించాలంటూ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ ఏసీబీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తొలిరోజున విచారణ అనంతరం నిందితులను విజయవాడ సబ్ జైలుకు తరలించారు.
ఏసీబీ ఉత్తర్వుల అమలు నిలిపివేత..
ఇదిలా ఉంటే.. ధూళిపాళ్ల నరేంద్రతోపాటు గోపాలకృష్ణన్, గురునాథంలను ఐదురోజులపాటు ఏసీబీ కస్టడీకిస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపేసింది. నరేంద్ర తదితరులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. తమను ఐదురోజులపాటు ఏసీబీ కస్టడీకిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నరేంద్ర తదితరులు హైకోర్టులో శనివారం హౌస్మోషన్ రూపంలో పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
డెయిరీ భూముల్ని సొంత ట్రస్ట్కు ఎందుకు మళ్లించారు!
Published Sun, May 2 2021 3:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement