ఎమ్మార్వొ నాగ‌రాజు బినామీల‌పై ఏసీబీ సోదాలు

ACB  investigation Continues  On MRO  Nagaraju Binami - Sakshi

సాక్షి, హైదరాబాద్ : కీస‌ర నాగ‌రాజు అవినితీ కేసులో బినామీల‌పై ఏసీబీ దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో బొల్లారంకు చెందిన నంద గోపాల్ అనే  వ్య‌క్తి బినామీగా ఉన్న‌ట్లు తేలింది. దీంతో ఇంకా అత‌ని ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వ‌హిస్తోంది. ఇక అవినీతి అక్రమాస్తుల కేసులో పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భూ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు పట్టుబడగా  అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. కోటి 10 లక్షల లంచం కేసులో నాగరాజు నిందితుడిగా ఉన్నాడు. నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న నాగరాజు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top