
కిక్కిరిసిన బోయకొండ
చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలి వచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆదివారం కావడంతో విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అఽధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. పోలీసులు ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకొన్నారు.