
ఒకరు కాదు.. నలుగురు!
అధ్యాపకుడే విద్యార్థిగా మారిన సంఘటనలో ఒకరు కాదు.. నలుగురు ఉన్నట్లు సమాచారం.దీనిపై విచారణ సాగుతోంది.
నేడు పాలిసెట్
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి బుధ వారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
నాసి రకం విత్తనాలు.. నకిలీ నార్లు.. సాగు చేసిన రైతులకు తప్పని కష్టాలు.. వీటి నుంచి గట్టెక్కించి.. కర్షకుడి కష్టం తీర్చి.. నాణ్యమైన నారు..మేలైన పంట.. అధిక దిగుబడి.. గిట్టు బాటు ధర దక్కేందుకు కృషి చేస్తూ.. అంటు క ట్టిన మొక్కలను అందజేస్తోంది ఏపీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ విజిటెబుల్స్ అండ్ ఫ్లవర్స్. పుడమిపుత్రులకు అండగా నిలుస్తోంది.
పలమనేరు: నాసిరకం విత్తనాలతో ఏటా రైతులు పండించిన పంట చేతికి రాక రైతులు నష్టాలు పడు తూనే ఉన్నారు. ఇక ప్రైవేటు నర్సరీలో కూరగాయల మొక్కలు కొందామంటే అధిక ధరల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడు రైతులకు అంటుకట్టిన మొక్కలను కుప్పం సమీపంలోని పెద్దబంగారునత్తం వద్ద ఉన్న ఏపీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ విజిటెబుల్స్ అండ్ ఫ్లవర్స్ అందిస్తోంది. ఏపీలోని రైతులు 90 శాతం రాయితీతో అవసరమైన కూరగాయల నార్లను పొందవచ్చు. హైబ్రిడ్ రకాలను అంటుకట్టి రైతులకు అందిస్తోండడంతో ఆ మొక్కలతో సాగు చేసిన రైతులు అధిక పంట దిగుబడులు సాధిస్తున్నారు.
గ్రాఫ్టింగ్ మొక్కలతో పలు లాభాలు
నాణ్యమైన విత్తనాలతో మొక్కలను పెంచి వాటికి హైబ్రిడ్ వంగడాలను అంటుకట్టి పెంచుతారు. తద్వారా ఈ మొక్కలు చీడపీడలను తట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
● భూమి ద్వారా మొక్కకు సంక్రమించే వ్యాధులు తక్కువగా ఉంటాయి.
● ఎకరానికి అవసరమైన మొక్కలు సంఖ్య బాగా తగ్గుతుంది.
● ఆరోగ్యవంతమైన మొక్క కారణంగా అధిక పంట దిగుబడి వస్తుంది.
● నాణ్యమైన ఉత్పత్తి కారణంగా రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుంది.
ఇప్పటికే 70 లక్షల టమాట మొక్కల పంపిణీ
సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ద్వారా 6 వేల మంది రైతులకు సాహో రకం హైబ్రిడ్ రకం టమాట నారు 70 లక్షల మొక్కలను 90 శాతం సబ్సిడీతో అందజేశారు. దీంతోపాటు మరో 40 లక్షల వంగ, కాకర, బీర, కర్భూజ నార్లను పంపిణీ చేశారు.
టమాట మొక్కకు అంటుకడుతున్న గ్రాఫ్టర్
రైతులకు పంపిణీ చేయడానికి తయారు చేసిన టమాట నారు
– 8లో
– 8లో
– 8లో
న్యూస్రీల్
90 శాతం సబ్సిడీతో అంటుకట్టిన కూరగాయల నారు
ఈ ఏడాది 1.20 కోట్ల మొక్కల పంపిణీ
ఇప్పటికే టమాట, వంగ, కాకర, బీర, కర్బూజ మొక్కలు
త్వరలో క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యాస్పికం నారు
సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ లక్ష్యం ఇదీ..
కొత్త కూరగాయల మొక్కలను అంటుకట్టడం, అభివృద్ధి చేయడం.
తక్కువ విస్తీర్ణంలో అధిక పంట ఉత్పత్తుల ను సాధించడం.
తక్కువ నీటితో ఎక్కువ పంటసాగు చేయడం.
క్రాప్ వైజ్ వాల్యూ చైన్ డెవలప్మెంట్.
కొత్త పద్ధతుల్లో నర్సరీ మేనేజ్మెంట్ విధానాలు.
నారు కోసం కర్ణాటక నుంచి వచ్చా...
నేను మూడెకరాల్లో ట మాట సాగు చేస్తున్నా ను. ఇందుకు టమాట మొలకల కోసం కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చా. ప్రైవేటు నర్సరీలో మొక్కలు కొంటే గ్యారెంటీ ఉండదు. అందుకే ఇక్కడ కొచ్చి తీసుకెళుతుంటాం.
– చెన్నమారియప్ప, మల్లసంద్ర, కోలారు
గ్రాఫ్టింగ్ మొక్కతో అధిక దిగుబడి
నేను ఇక్కడ నాలుగేళ్ల నుంచి గ్రాఫ్టర్గా పనిచేస్తున్నా. అంటుకట్టిన మొక్కలను నాటితే ది గుబడి బాగుంటుంది. అందుకే మూడు రా ష్ట్రాలకు చెందిన రైతులు ఇక్కడే కూరగాయల మొక్కలను తీసుకెళుతుంటారు. ఇది పూర్తిగా హార్టికల్చర్ అధికారుల పర్యవేక్షణలో జరుగు తుంది. నాణ్యమైన సీడ్స్తో మొక్కలను పెంచి ఆపై అంటుకడతాం.
– రాశి, గ్రాఫ్టర్, ఎక్స్లెన్స్ సెంటర్, కుప్పం
ప్రయోగాలన్నీ రైతుల మేలు కోసమే..
టమాట కాండంగా వంగ, వంగకు కాండంగా మరో మొక్క, ఇలా ప్రయోగాలు చేసి విత్తనాలను మొలకెత్తించిన మొక్కలకు హై బ్రిడ్ రకాలను అంటుకట్టి రైతులకు అందిస్తున్నాం. ఈ సీజన్లో 1.20 కోట్ల కూరగాయల మొక్కలను రైతులకు అందజేశాం. అంటుకట్టిన మొక్క సాగుతో మంచి దిగుబడులు వస్తాయి. మేము చేసే ప్రయోగాలన్నీ రైతులకు మేలు చేసేందుకే. – కోటేశ్వరావు,
ఏడీ, సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్, కుప్పం
త్వరలో మరిన్ని కూరగాయల నార్లు
ఈ సెంటర్లో త్వరలో రైతులకు అవసరమైన కాస్పికం, కాలీఫ్లవర్, స్వీట్కార్న్ నార్లను సైతం సిద్ధం చేస్తున్నట్టు ఇక్కడి హార్టికల్చర్ అధికారులు తెలిపారు. నారు అవసరమైన రాష్ట్రానికి చెందిన రైతులు సంబంధిత హెచ్ఓ ద్వారా లేఖ తీసుకు ని వస్తే, ధర ఉన్న మొక్కను 90 శాతం సబ్సిడీతో రూ.9 పైసలకే రైతులు పొందవచ్చు. ఇతర రాష్ట్రాల రైతులు మాత్రం పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది. టమాటకు సంబంధించి ప్రైవేటు నర్సరీలో మొక్క రూ.2 నుంచి 3 వరకు డిమాండ్ ఆధారంగా విక్రయిస్తున్నారు. దీంతో రైతులు ఎక్స్లెన్స్ సెంటర్లో మొక్కలను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఒకరు కాదు.. నలుగురు!

ఒకరు కాదు.. నలుగురు!

ఒకరు కాదు.. నలుగురు!

ఒకరు కాదు.. నలుగురు!

ఒకరు కాదు.. నలుగురు!

ఒకరు కాదు.. నలుగురు!

ఒకరు కాదు.. నలుగురు!