
ట్రైనీ కలెక్టర్గా నరేంద్ర పడాల్
– సివిల్స్లో ఆల్ ఇండియా స్థాయి 545 ర్యాంక్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా ట్రైనీ కలెక్టర్గా చిట్టపులి నరేంద్ర పడాల్ నియమితులయ్యారు. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలానికి చెందిన ఆయన రెండో ప్రయత్నంలో సివిల్స్లో ఆల్ ఇండియా 545 ర్యాంక్ సాధించారు. ఆయన సోమవారం ట్రైనీ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సివిల్స్ సాధించారు.