ఉపాధి హామీ నిర్వీర్యానికి కుట్ర | - | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీ నిర్వీర్యానికి కుట్ర

Apr 29 2025 7:07 AM | Updated on Apr 29 2025 7:07 AM

ఉపాధి హామీ నిర్వీర్యానికి కుట్ర

ఉపాధి హామీ నిర్వీర్యానికి కుట్ర

బంగారుపాళెం: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి, పేదల కడుపు కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు ఆరోపించారు. సోమవారం మండలంలోని తగ్గువారిపల్లె పంచాయతీలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలతో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకం నిరుపేదలకు వరమన్నారు. ఈ పథకంలోని పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని విమర్శించారు. పేదలకడుపు కొట్టి అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తుందని మండిపడ్డారు. ఉపాధి పనిదినాలను 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలని, రోజు వేతనం రూ.600 ఇచ్చేలా పోరాటం సాగిస్తామన్నారు. 15 రోజులకు వేతనాలు చెల్లించాలని లేని పక్షంలో 2 శాతం వడ్డీతో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హక్కులను కాపాడాలని మే నెల 20వ తేదీ చేపట్టనున్న సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ మే ఒకటి నుంచి అమలు చేసే ఇన్సూరెన్స్‌ పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జాబ్‌కార్డు ఉన్న వారందరికీ అమలయ్యేలా అధికారులు చరలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం కార్యదర్శి శంకరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement