
నగరిలో కొండముచ్చు హల్చల్
నగరి : పట్టణంలో శనివారం ఒక కొండముచ్చు హల్చల్ చేసింది. ఎక్కడో అడవుల్లో మాత్రమే కనిపించే కొంముచ్చు దారితప్పి ఎలాగో నగరి పట్టణానికి వచ్చేసింది. దీన్ని చూడడానికి స్థానికు లు, చిన్నారులు ఆసక్తి చూపారు. అరటి పండ్లు, టెంకాయలు అందిస్తూ దాని వెంట పడ్డారు.
తెగిన వైర్లు..
50 మామిడి చెట్లు ధ్వంసం
వెదురుకుప్పం: మండలంలోని చెంచుగుడి సమీపంలో శనివారం సాయంత్రం 220 కేవీ విద్యుత్ లైన్ తెగిపడినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనలో 50 మామిడి చెట్లు ధ్వంసం అయ్యాయి. సాయంత్రం సమయంలో ఉన్నట్టుండి హఠాత్తుగా పెద్ద శబ్దంతో విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. పొలాలపై విద్యుత్ వైర్లు పడడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో రైతు లోకేష్ రెడ్డికి చెందిన 50 మామిడి చెట్లు విరిగిపోయినట్లు బాధితుడు తెలిపారు. మామిడి కాయలు నేలరాలినట్లు పేర్కొన్నారు.
30న జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ నెల 30వ తేదీన జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ ప్రత్యేక ఆహ్వానితులుగా, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశం నిర్వహణ, అజెండా అంశాల ఏర్పాటుకు సంబంధించి డీఆర్వో మోహన్కుమార్ క్షేత్రస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు.

నగరిలో కొండముచ్చు హల్చల్