
కుప్పంరూరల్: వేర్వేరు చోట్ల జరిగిన రెండు రైలు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు గురువారం మృతి చెందా రు. కుప్పం మండలం క్రిష్ణదాసనపల్లి గ్రామానికి చెందిన యువకుడు బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడ్డగా, బీహార్కు చెందిన మరో యువకుడు కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారీ కిందపడి దుర్మరణం పాలయ్యాడు.
కుప్పం యువకుడు బెంగళూరులో...
కుప్పం మండలం, క్రిష్ణదాసనపల్లి గ్రామానికి చెందిన లేట్ సోమశేఖర్ కుమారుడు కె. ఎస్. భువనచంద్ర (27) బెంగళూరు వైట్ఫీల్డ్లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం మేరకు.. తల్లిదండ్రులు లేని భువన చంద్ర బెంగళూరు పట్ణణంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాడు. నిత్యం బెంగళూరుకు ఉదయం వెళ్లి, రాత్రి ఇంటికి వస్తుంటాడు. రోజులాగానే భువన చంద్ర గురువారం ఉదయం బయలుదేరి బెంగళూరు వెళ్లాడు. ఏమైదో తెలియదు గానీ బెంగళూరు నగరంలోని వైట్ఫీల్డ్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. గురువారం రాత్రి రైల్వే పోలీసులు భువన చంద్ర మృతదేహానికి పోస్టుమార్టమ్ చేసి బంధువులకు అప్పగించారు.
రైలు నుంచి జారీపడి బిహార్ యువకుడు...
సుమారు 27 ఏళ్ల వయస్సు ఉన్న బిహార్కు చెందిన యువకుడు బుధవారం అర్థరాత్రి రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందినట్లు కుప్పం పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి బెంగళూరు – గౌహతి వెళ్లే రైలు నుంచి జారి పడి ఉండవచ్చని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. వైట్ టీషర్టు, బ్లాక్ ఫ్యాంటు ధరించి ఉన్నట్లు చెప్పారు. అతని వద్ద బెంగళూరు నుంచి కంచ్గంజ్ వెళ్లే రైల్వే టికెట్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు శవాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు కుప్పం రైల్వే పోలీసులు తెలిపారు.