
కుప్పం కిరీటంపై కూటమి కన్ను
వైఎస్సార్ సీపీ సభ్యులకు ప్రలోభాలు
అధికారం చేపట్టిన టీడీపీ ఎలాగైనా మున్సిపల్ కౌన్సిల్ ఎంపిక కోసం ప్రస్తుతం 9 మంది కౌన్సిల్ సభ్యులతో ఉన్న తెలుగుదేశం పార్టీ మరో ముగ్గురిని పార్టీలోకి లాగేయాలని ప్రలోభాలకు గురి చేస్తోంది. ఓ మహిళా కౌన్సిలర్ కుమారుడికి ఉద్యోగం కల్పిస్తామని ఆశ పెట్టారు. మరో ముగ్గురు కౌన్సిలర్లను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం.
అందరి దృష్టి కుప్పం చైర్మన్ గిరిపైనే పడింది. టీడీపీ నుంచి ఇద్దరు, వైఎస్సార్ సీపీ నుంచి ఒకరు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎవరు చైర్మన్ అవుతారనే విషయం 28వతేదీన తేలనుంది.