
వైఎస్సార్సీపీ వాళ్లా.. మర్యాదగా వెళ్లిపోండి
● టీడీపీతో కలిసి వస్తే న్యాయం చేస్తామన్న తహసీల్దార్ ● దళిత గ్రామం సాకుతో క్వారీకి పట్టా భూమిలో రోడ్డు వేసిన కూటమి నేతలు ● మాజీ డిప్యూటీ సీఎం వద్ద గోడు వెళ్లబోసుకున్న బాధితులు
పెనుమూరు (కార్వేటినగరం) : మీరు వైఎస్సార్సీపీ వాళ్లా.. మర్యాదగా బయటకు వెళ్లిపోండి.. కూట మి నాయకులతో కలిసి వస్తారా.. లోపలకి రండి అంటూ ఓ తహసీ ల్దారు పచ్చనేతలకు బానిసై, ఒక పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నాడని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ఆరోపించారు. పెనుమూరు మండలం, చెర్లోపల్లి గ్రామానికి చెందిన హేమాద్రి నాయుడు, దాము కలిసి మంగళవారం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వద్ద కూటమి నాయకులు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను వివరించారు. స్పందించిన మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. అయినా స్పందించక పోవడంతో అసహనాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. సర్వే నం.381/1, 384/ సీ/1లో హేమాద్రినాయుడు, దాముకు చె ందిన భూమిలో దళితవాడకు దారి పేరు తో టీడీపీ నాయకుల క్వారీ కోసం పట్టా భూమిలో దౌర్జన్యంతో అగ్రకులస్తులు కర్రలు, రాడ్లు పట్టుకొని దళితులను భ యబ్రాంతులకు గురిచేసి రోడ్డు వేయడం అన్యాయమన్నారు. బాధితులకు అండగా నిలవాల్సిన అధికారులు కూటమి నేతల ఒత్తిడికి తలొగ్గి ప్రజలను హేళనగా మాట్లాడడం మంచిది కాదని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్థిక వనరుల విధ్వంసమే రెడ్ బుక్ లక్ష్యం
గంగాధరనెల్లూరు : వైసీపీ వాళ్ల ఆర్థిక వనరుల విధ్వంసమే కూటమి ప్రభుత్వం రెడ్బుక్ లక్ష్య మని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్రంగా మండిపడ్డారు. గంగాధర్ నెల్లూరు మండలం, కుప్పనపల్లి గ్రామంలో రైతు శంకర్రెడ్డి పొలంలో కూటమి నాయకులు దౌర్జన్యంగా పచ్చని మామిడి చెట్లను నరికి వేసిన ఘటనలో రైతును పరామర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా వైసీపీ వాళ్లపై దౌర్జ న్యాలు, ఆర్థిక వనరుల నిర్వీర్యమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. సీనియర్ నాయకు లు బండి హేమసుందర్రెడ్డి, వెంకటరెడ్డి, రాష్ట్ర రైతు నాయకులు చెందురాజు, కమాలర్రెడ్డి, హరి రెడ్డి పాల్గొన్నారు.

వైఎస్సార్సీపీ వాళ్లా.. మర్యాదగా వెళ్లిపోండి