ఏఏఐ చైర్మన్‌గా విపిన్‌ కుమార్‌ | Vipin Kumar appointed chairman of Airports Authority of India | Sakshi
Sakshi News home page

ఏఏఐ చైర్మన్‌గా విపిన్‌ కుమార్‌

Oct 29 2024 5:18 AM | Updated on Oct 29 2024 5:18 AM

Vipin Kumar appointed chairman of Airports Authority of India

న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విపిన్‌ కుమార్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్‌ బిహార్‌ క్యాడర్‌కు చెందిన ఆయన ఈ పదవిలోకి రాక ముందు కేంద్ర విద్యాశాఖకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్, లిటరసీ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 

బిహార్‌లో జిల్లా మెజి్రస్టేట్‌గా, బిహార్‌ బ్రిడ్జ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గానూ విధులు నిర్వర్తించారు. ఏఏఐ పూర్తి స్థాయి చైర్మన్‌ సంజీవ్‌ కుమార్‌ డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఏఏఐ సభ్యులు ఎం.సురేశ్‌ తాత్కాలిక చైర్మన్‌గా ఇప్పటి వరకు వ్యవహరించారు. మినీ రత్న అయిన ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రస్తుతం 137 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement