శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి, నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 116.66 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 74,243.34 వద్ద, నిఫ్టీ 49.85 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 23,366.70 వద్ద నిలిచాయి.
అగ్రి-టెక్ (ఇండియా) లిమిటెడ్, ప్రిమో కెమికల్స్ లిమిటెడ్, రామ్కో సిస్టమ్స్ లిమిటెడ్, భగేరియా ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జాగ్రన్ ప్రకాశన్ లిమిటెడ్, సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, సన్ఫ్లాగ్ ఐరన్ & స్టీల్ కంపెనీ లిమిటెడ్, వింధ్య టెలిలింక్స్ లిమిటెడ్, రవీంద్ర ఎనర్జీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


