ముకేశ్‌ అంబానీపై రూ.15 కోట్ల జరిమానా | SEBI fines Reliance Industries to Mukesh Ambani and two other entities | Sakshi
Sakshi News home page

ముకేశ్‌ అంబానీపై రూ.15 కోట్ల జరిమానా

Jan 2 2021 3:38 AM | Updated on Jan 2 2021 12:41 PM

SEBI fines Reliance Industries to Mukesh Ambani and two other entities - Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీపై  సెబీ రూ.15 కోట్ల జరిమానా విధించింది. ముకేశ్‌ అంబానీతో పాటు ఆయన సీఎమ్‌డీగా ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్, మరో రెండు సంస్థలపై కూడా సెబీ జరిమానాలు వడ్డించింది. 2007, నవంబర్‌లో రిలయన్స్‌ పెట్రోలియమ్‌ లిమిటెడ్‌(ఆర్‌పీఎల్‌) షేర్ల ట్రేడింగ్‌లో అవకతవకలకు  సంబంధించిన కేసులో ఈ మేరకు జరిమానాలను సెబీ విధించింది.  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.25 కోట్లు, నవీ ముంబై సెజ్‌ ప్రైవేట్‌  లిమిటెడ్‌ రూ.20 కోట్లు, ముంబై సెజ్‌ లిమిటెడ్‌ రూ.10 కోట్ల మేర జరిమానాలు చెల్లించాలని సెబీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ తాజా సెబీ ఆదేశాలపై  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇంకా స్పందించలేదు.  

షేర్ల ట్రేడింగ్‌లో అవకతవకలు: ఆర్‌పీఎల్‌లో 4.1% వాటాను విక్రయించాలని 2007, మార్చిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిర్ణయించింది. అదే ఏడాది నవంబర్‌లో ఆర్‌పీఎల్‌ షేర్ల ట్రేడింగ్‌కు సంబంధించి నగదు, ఫ్యూచర్‌ సెగ్మెంట్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఆర్‌పీఎల్‌లో తన వాటా షేర్ల విక్రయానికి సంబంధించి లావాదేవీల ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అవకతవకలకు పాల్పడిందని  సెబీ అడ్జుడికేటింగ్‌ ఆఫీసర్‌ బి.జె. దిలిప్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement