
రాబోయే బోర్డు సమావేశంలో మార్కెట్లో సులభతర వ్యాపారాన్ని పెంపొందించడానికి సెక్యూరిటీ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిబంధనలను క్రమబద్ధీకరించడంపై దృష్టి సారించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ 18న జరిగే ఈ సమావేశంలో కీలక ప్రతిపాదనలపై చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. అందులోని కొన్నింటి గురించి కింద తెలియజేశాం.
పేపర్ వర్క్ను తగ్గించడానికి, కార్యకలాపాలను మరింత సులభతరం చేయడానికి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్(క్యూఐపీ)ల నిబంధనలు క్రమబద్ధీకరించడం.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఆర్ఈఐటీలు), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులను (ఇన్వీట్లు) ఈక్విటీలతో అనుసంధానం చేయడం వల్ల ఈ రంగాల్లో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెరిగే అవకాశాన్ని మెరుగుపరచడం.
కో-ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్స్లో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)లను సులభతరం చేయడం.
ప్రభుత్వ బాండ్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్పీఐ) నిబంధనలను సడలించడం.
చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) నిబంధనలను బలోపేతం చేయడం.
క్లియరింగ్ కార్పొరేషన్ల స్వతంత్రతను ఖరారు చేయడం.
ఇదీ చదవండి: 5-10 ఏళ్లలో ప్రమాదంలో ఉద్యోగాలు
ఈ ప్రతిపాదనలను మెరుగుపరచడానికి స్టాక్ బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లతో సహా పరిశ్రమ వాటాదారులతో సెబీ సంప్రదింపులు జరుపుతోంది. మార్కెట్ పారదర్శకత, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ సమావేశలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని అంచనా.