సెబీ బోర్డు సమావేశంలో కీలక మార్పులు? | SEBI board meeting on June 18 focus on optimizing regulations | Sakshi
Sakshi News home page

సెబీ బోర్డు సమావేశంలో కీలక మార్పులు?

May 26 2025 12:15 PM | Updated on May 26 2025 12:22 PM

SEBI board meeting on June 18 focus on optimizing regulations

రాబోయే బోర్డు సమావేశంలో మార్కెట్‌లో సులభతర వ్యాపారాన్ని పెంపొందించడానికి సెక్యూరిటీ ఎక్స్ఛేంజీ బోర్డ్‌​ ఆఫ్‌ ఇండియా(సెబీ) నిబంధనలను క్రమబద్ధీకరించడంపై దృష్టి సారించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్‌ 18న జరిగే ఈ సమావేశంలో కీలక ప్రతిపాదనలపై చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. అందులోని కొన్నింటి గురించి కింద తెలియజేశాం.

  • పేపర్ వర్క్‌ను తగ్గించడానికి, కార్యకలాపాలను మరింత సులభతరం చేయడానికి క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్స్‌(క్యూఐపీ)ల నిబంధనలు క్రమబద్ధీకరించడం.

  • రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టులు (ఆర్ఈఐటీలు), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టులను (ఇన్వీట్‌లు) ఈక్విటీలతో అనుసంధానం చేయడం వల్ల ఈ రంగాల్లో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెరిగే అవకాశాన్ని మెరుగుపరచడం.

  • కో-ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రక్చర్స్‌లో ఆల్టర్‌నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్ (ఏఐఎఫ్)లను సులభతరం చేయడం.

  • ప్రభుత్వ బాండ్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) నిబంధనలను సడలించడం.

  • చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) నిబంధనలను బలోపేతం చేయడం.

  • క్లియరింగ్ కార్పొరేషన్ల స్వతంత్రతను ఖరారు చేయడం.

ఇదీ చదవండి: 5-10 ఏళ్లలో ప్రమాదంలో ఉద్యోగాలు

ఈ ప్రతిపాదనలను మెరుగుపరచడానికి స్టాక్ బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లతో సహా పరిశ్రమ వాటాదారులతో సెబీ సంప్రదింపులు జరుపుతోంది. మార్కెట్ పారదర్శకత, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ సమావేశలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement