Xiaomi Republic Day Sale 2023: 10వేలకే టీవీ, రెడ్‌మీ స్మార్ట్‌టీవీ 32 ఉచితంగా పొందే లక్‌ మీదే!

Republic day sale 2023  discounts Smartphones Tablets check here - Sakshi

సాక్షి,ముంబై:  చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ షావోమీ రిపబ్లిక్ డే సేల్ ప్రకటించింది. 74వ గణతంత్ర సంవత్సరం సందర్భంగా,  అధికారిక వెబ్‌సైట్ ప్రత్యేకమైన డీల్స్‌, ప్రమోషన్‌లను అందిస్తోంది.  రోజువారీ 12 గంటలకు పరేడ్, 3 గంటలకు ఫ్లాష్ సేల్,  ఎక్స్చేంజ్ అవర్‌ లాంటివి ప్రకటించింది. అంతేకాకుండా, వినియోగదారులు ప్లే   అండ్‌  విన్ ఆఫర్ ద్వారా  రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ 32,  రెడ్‌మి నోట్‌ ప్రోలాంటి అద్భుతమైన ఉచిత ఉత్పత్తులను గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు. జనవరి 20 వరకు, 23న ఈ సేల్‌ అందబాటులో ఉంటుంది.ఈ సేల్‍లో షావోమీ  స్మార్ట్‌ఫోన్లు స్మార్ట్ టీవీలు, ల్యాప్‍టాప్స్‌, ఇతర​ ప్రొడక్టులు డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. 

అలాగే ఇండస్‍ఇండ్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో పాటు యూపీఐ పేమెంట్లపై కూడా అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. ముఖ్యంగా ఈ సేల్‍లో కొన్ని షావోమీ, రెడ్‍మీ, ఎంఐ టీవీలు మంచి తగ్గింపుతో  స్మార్ట్‌టీవీలనుకొనుగోలు చేయవచ్చు. 

రెడ్‍మీ స్మార్ట్ టీవీ 32 హెచ్‍డీ రెడీ
రెడ్‍మీ 32 ఇంచుల ఈ స్మార్ట్ టీవీ  రూ.10,999గా ఉంది. ఇండస్‍ఇండ్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో ఈఎంఐ పద్ధతిలో ఈ టీవీని కొనుగోలు చేస్తే రూ.2,000 అదనపు తగ్గింపు. అంటే రూ.9,999కే ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో సింగిల్ పేమెంట్‍లో కొంటే రూ.1,500 తగ్గింపు ఉంటుంది. పేటీఎం వ్యాలెట్‍, ఏదైనా యూపీఐ ద్వారా పేమెంట్లపై  రూ.1,000 డిస్కౌంట్  లభ్యం.

షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ
షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ   రూ.12,499 ధరతో  సొంతం చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ పేమెంట్లపై రూ.1,000, పేటీఎం వ్యాలెట్‍తో చెల్లింపులు చేస్తే మరో రూ.1,000, ఇండస్‍ఇండ్ క్రెడిట్ కార్డు ఆఫర్లు వినియోగించుకుంటే ఈ 32 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని రూ.10,499కే  కొనుగోలు చేయవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top