కార్వీ కేసులో ప్రముఖ సంస్థలకు ఊరట | Relief For SEBI And NSDL In Karvy Stock Broking Case | Sakshi
Sakshi News home page

కార్వీ కేసులో ప్రముఖ సంస్థలకు ఊరట

Jan 27 2024 3:14 PM | Updated on Jan 27 2024 3:40 PM

Relief For Sebi And NSDL In Karvy Stock Broking Case - Sakshi

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కేసులో సెబీ, ఎన్‌ఎస్‌డీఎల్‌కు పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో గత ఏడాది డిసెంబరు 20న సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ తన ఖాతాదారుల షేర్లను బ్యాంకుల వద్ద తనఖాపెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ కుంభకోణం బయటపడడంతో సెబీ, ఎన్‌ఎస్‌డీఎల్‌ రంగంలోకి దిగి ఆ షేర్లను మళ్లీ ఖాతాదారులకు బదిలీ చేయించాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ నేతృత్వంలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ విషయాన్ని శాట్‌లో సవాల్‌ చేశాయి.

ఇదీ చదవండి: పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..!

ఫలితంగా కార్వీ తనఖాపెట్టిన షేర్ల విలువకు సమాన మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలని శాట్‌ గత ఏడాది డిసెంబరులో సెబీ, ఎన్‌ఎస్‌డీఎల్‌ను ఆదేశించింది. ఈ సంస్థలు సంబంధిత అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేశాయి. కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా శాట్‌ తీర్పుపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement