
అంతర్జాతీయంగా నెలకొన్ని ప్రతికూల పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసివచ్చాయి. ఫలితంగా దేశీయ, విదేశీయ మదుపర్లు.. భారత్ మార్కెట్లో పెట్టుపడులు పెట్టేందుకు మొగ్గు చూపారు. ఫలితంగా వరుసగా మూడోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.
బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 271 పాయింట్ల లాభంతో 71657 వద్ద నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 21618 వద్ద ట్రేడింగ్ను ముగించాయి.
సిప్లా, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్, హెచ్సీఎల్, అదానీ పోర్ట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ముగియగా.. ఓఎన్జీసీ, దివిస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఆల్ట్రా టెక్ సిమెంట్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలతో ముగిశాయి.