క్యూ1లో రూ. 13,492 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఈ ఏడాది క్యూ1లో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 23 శాతం జంప్చేసి రూ. 13,492 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం వృద్ధితో రూ. 2,37,848 కోట్లకు చేరింది. తొలి ఏడాది ప్రీమియం ఆదాయం రూ. 7,525 కోట్ల నుంచి రూ. 9,217 కోట్లకు ఎగసింది. రెన్యువల్ ప్రీమియం ఆదాయం రూ. 61,833 కోట్లకు బలపడింది. సింగిల్ ప్రీమియం ఆదాయం రూ. 56,369 కోట్లకు పుంజుకుంది. వెరసి నికర ప్రీమియం ఆదాయం రూ. 1,19,200 కోట్ల నుంచి రూ. 1,27,250 కోట్లకు జంప్చేసింది.


