
మొబైల్ గేమర్లకు శుభవార్త.. గేమింగ్ ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెండు కొత్త అపరిమిత 5జీ డేటా ప్లాన్లను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్లు హై-స్పీడ్ డేటాను మాత్రమే కాకుండా ఉచిత బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) స్కిన్లు, జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ వంటి గేమింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వినియోగదారులు వాటిని డౌన్లోడ్ చేయకుండానే 500కి పైగా ప్రీమియం గేమ్లను ఆడుకోవచ్చు.
ప్లాన్ వివరాలు.. ప్రయోజనాలు
జియో ప్రారంభించిన కొత్త ప్లాన్లు.. ఒకటి రూ.495 ప్లాన్, మరొకటి రూ.545 ప్లాన్. ఈ రెండు ప్లాన్లూ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. రూ.495 ప్లాన్లో రోజుకు 1.5 జీబీ డేటా, అదనంగా 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ లభిస్తుంది. రూ.545 ప్లాన్లో రోజుకు 2 జీబీ 4జీ డేటా, అన్లిమిటెడ్ 5జీ డేటాతో పాటు అదే గేమింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి.
👉 ఈ ప్లాన్తో జియో సిమ్ ఏడాదంతా యాక్టివ్.. 👈
రెండు ప్లాన్లలో బార్డ్స్ జర్నీ సెట్, డెసర్ట్ టాస్క్ ఫోర్స్ మాస్క్, ట్యాప్ బూమ్ మొలోటోవ్ కాక్టెయిల్ వంటి ప్లేయర్లకు ఉచిత ఇన్-గేమ్ వస్తువులను అందించే ప్రత్యేక బీజీఎంఐ రివార్డ్ కూపన్లు కూడా ఉన్నాయి. ఈ రివార్డులను క్లెయిమ్ చేసుకోవడానికి వినియోగదారులు గేమింగ్ ప్యాక్లలో దేనితోనైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసిన తర్వాత, ధృవీకరణ సందేశం వస్తుంది. మై జియో యాప్లో రివార్డ్ కూపన్లు లభిస్తాయి. ప్లేయర్ క్యారెక్టర్ ఐడీ, ఇచ్చిన యూనిక్ కోడ్ ఉపయోగించి ఈ కూపన్లను అధికారిక బీజీఎంఐ వెబ్సైట్లో రీడీమ్ చేసుకోవచ్చు.
ఇక జియోగేమ్స్ క్లౌడ్ వినియోగదారులు హై-ఎండ్ పరికరాలు అవసరం లేకుండా నేరుగా వారి స్మార్ట్ఫోన్లు, టీవీలు లేదా బ్రౌజర్లలో గేమ్స్ ఆడవచ్చు.ఈ సేవను పొందడానికి వినియోగదారులు జియోగేమ్స్ యాప్ను ఇన్స్టాల్ చేసి, వారి జియో నంబర్తో లాగిన్ కావాలి. సబ్ స్క్రిప్షన్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది.