EPFO: ఈ-నామినేషన్ దాఖలు చేయకపోతే ఏడు లక్షలు రానట్లే?

How to File e-Nomination for PF Account - Sakshi

‎ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఉద్యోగుల భవిష్యత్‌ కోసం నియమించిన సంస్థ. ప్రతి నెల జీతం పొందిన వ్యక్తుల నుంచి కొంత మొత్తాన్ని పీఎఫ్ రూపంలో ఈ సంస్థకు యాజమాన్యం కేటాయిస్తుంది. ఈపీఎఫ్ఓ తన సభ్యుల కోసం ఈ-నామినేషన్ దాఖలు చేసే సదుపాయాన్ని కల్పిస్తుంది. ఈ-నామినేషన్ దాఖలు చేయడం చాలా ముఖ్యం. ఒక సభ్యుడి మరణంపై ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), పెన్షన్ (ఈపీఎస్), ఇన్స్యూరెన్స్ (ఈడీఎల్ఐ) ప్రయోజనాలను సులభంగా పొందడానికి ఈ-నామినేషన్ దాఖలు చేయాలని ఈపీఎఫ్ఓ తన ఇటీవలి ట్వీట్ లో తెలిపింది.

ఉద్యోగులకు నామినేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ ​ఆన్‌లైన్ సేవలను ప్రారంభించింది. ‎ఈ-నామినేషన్ చేయడం ద్వారా ఖాతాదారుడు మరణిస్తే ఈడీఎల్ఐ కింద రూ.7 లక్షల వరకు నామినీకి అందుతాయి. ఈ-నామినేషన్ కోసం ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ద్వారానే నామినేషన్ చేసుకునే అవకాశం ఈపీఎఫ్ఓ కల్పించింది. ఒకవేళ మీరు ఇంకా ఈ-నామినేషన్ దాఖలు చేయనట్లయితే దిగువ పేర్కొన్న విధంగా చేయవచ్చు.

ఈపీఎఫ్ఓలో ఈ-నామినేషన్ చేయండి ఇలా.. 

  • ‎‎ఈపీఎఫ్ఓ అధికారిక లింక్ పై క్లిక్ చేయండి. (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/)
  • ‎‎యుఎఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి.‎
  • మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి.
  • అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ‎ఈ-నామినేషన్ ఎంచుకోండి.‎
  • తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి.‎
  • ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు.  
  • వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి.‎
  • ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్ తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి.‎
  • ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది.
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top