ఏటా రూ.10.8 లక్షలు జీతం.. రూ.3.2 లక్షలు పొదుపు అయినా.. | Housing Crisis Even Top employees Cant Afford Home | Sakshi
Sakshi News home page

ఏటా రూ.10.8 లక్షలు జీతం.. రూ.3.2 లక్షలు పొదుపు అయినా..

Jun 24 2025 4:43 PM | Updated on Jun 24 2025 5:05 PM

Housing Crisis Even Top employees Cant Afford Home

సొంతంగా ఇల్లు కలిగి ఉండడం అనేది సామాన్యుడి కల. దేశంలోని కొన్ని నగరాల్లో ఇకపై అది కలగానే ఉంటుందని కొన్ని నివేదికల వివరాల ద్వారా తెలుస్తుంది. భారత వాణిజ్య నగరం ముంబయి వంటి నగరాల్లో అయితే సామాన్యుడు ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు పోగుచేసి ఇల్లు కొనడం దాదాపు అసాధ్యం అనే వాదనలున్నాయి. అందుకు పెరుగుతున్న ఆస్తుల విలువే ప్రధాన కారణమని రిపోర్ట్‌లు తెలుపుతున్నాయి.

ఒక విశ్లేషణ ప్రకారం నెలకు రూ.90 వేలు వేతనం అంటే ఏటా రూ.10.8 లక్షలు ఆదాయం పొందే ఓ వ్యక్తి ఉన్నారనుకుందాం. వార్షికంగా 30.2% రేటుతో రూ.3.2 లక్షలు పొదుపు చేస్తున్నాడనుకుందాం. తాను ఒకవేళ ముంబయిలో స్థిరాస్తి కొనుగోలు చేయాలని భావిస్తుంటే అక్కడి సగటు ఆస్తి వ్యయం మార్చి 2025 లెక్కల నాటికి చదరపు అడుగుకు రూ.29,911గా ఉంది. సాధారణ ఇంటి పరిమాణం 1,184 చదరపు అడుగులు లెక్కిస్తే ఇంటికి మొత్తం వ్యయం రూ.3.54 కోట్లు అవుతుంది. దీని ప్రకారం ఏటా తాను పొదుపు చేస్తున్న డబ్బు ఆధారంగా 109 ఏళ్లకు రూ.3.54 కోట్లు సమకూరుస్తాడు. అంటే ఇప్పుడు ప్లాన్‌ చేస్తే 109 ఏళ్లు తర్వాత ఇల్లు కొంటాడు. అదికూడా ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోకపోతేనే!

ఇదీ చదవండి: ఆధార్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు!

దాదాపు అదే ధర కలిగిన ఆస్తిని దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కొనుగోలు చేయాలంటే కొంత తక్కువ సమయం పడుతుంది. 

  • గుర్‌గావ్‌లో ఇది 64 ఏళ్లుగా ఉంది. 

  • బెంగళూరులో 36 ఏళ్లు

  • ఢిల్లీ-35 ఏళ్లు

  • చండీగఢ్‌లో 15 ఏళ్లు పడుతుంది.

సంక్షోభానికి కారణమేమిటి?

  • తీవ్రమైన భూ కొరత ఉండడం.

  • అధిక జనసాంద్రత, పట్టణ వలసలు పెరుగుతుండడం.

  • డిమాండ్ తగ్గినప్పటికీ డెవలపర్లు సిండికేట్‌గామారి ఇష్టారీతిన ధరలు పెంచడం.

  • విధానపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చౌక గృహాల నిర్మాణంపై డెపలపర్లు మొగ్గు చూపకపోవడం.

  • ఫలితంగా సంపన్నులు సైతం ఒకింత ఆలోచించి కొనుగోలు నిర్ణయం తీసుకునేలా రేట్లు పెరగడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement