లాభాల స్వీకరణకే ఎఫ్‌ఐఐల అమ్మకాలు  | Heavy selling by foreign investors likely due to India delivering good returns | Sakshi
Sakshi News home page

లాభాల స్వీకరణకే ఎఫ్‌ఐఐల అమ్మకాలు 

Feb 18 2025 5:08 AM | Updated on Feb 18 2025 7:50 AM

Heavy selling by foreign investors likely due to India delivering good returns

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: ఎడాపెడా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) అమ్మకాలతో ఆందోళన చెందుతున్న మదుపరులకు కాస్త ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. పెట్టుబడులపై మంచి రాబడులను అందించే పటిష్ట స్థితిలో భారత ఎకానమీ ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారని ఆమె చెప్పారు.

‘ఎఫ్‌ఐఐలు తమకు అనువైనప్పుడు లేదా లాభాలను స్వీకరించే అవకాశం ఉన్నప్పుడు వైదొలుగుతూ ఉంటారు. భారత ఎకానమీలో నేడు పెట్టుబడులపై మంచి రాబడులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దానికి తగ్గట్లే లాభాల స్వీకరణ కూడా జరుగుతోంది‘ అని తెలిపారు. ఎఫ్‌ఐఐలు గతేడాది అక్టోబర్‌ నుంచి రూ. 1.56 లక్షల కోట్ల మేర స్టాక్స్‌ అమ్మగా.. ఇందులో ఏకంగా రూ. లక్ష కోట్ల స్టాక్స్‌ విక్రయాలు ఈ ఏడాడి స్వల్ప కాలంలోనే నమోదవడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement