ఈపీఎఫ్‌ వడ్డీరేటు యథాతథం

 EPFO maintains 8.5 PC interest rate for FY21 - Sakshi

ఈపీఎఫ్‌ వడ్డీరేటు 8.5శాతంగా నిర్ణయం

సాక్షి, న్యూఢిల్లీ :  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గానూ ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) డిపాజిట్లపై వడ్డీరేటును 8.5 శాతంగా  ఖరారు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.  2020-21 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా ఉంచారు. గురువారం శ్రీనగర్‌లో జరిగిన ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం ఈ మేరకు  నిర్ణయించింది.  ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన మరికొద్ది క్షణాల్లో వెలువడనుంది.

కాగా  కరోనామహమ్మారి  నేపథ్యంలో పీఎఫ్‌ వడ్డీరేటును తగ్గనుందనే అంచనాలు వెలువడ్డాయి.  2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018-19లో ఇది 8.65 శాతంగా  ఉండగా,  గత ఏడాది 8.5 శాతం వద్ద 7 సంవత్సరాల  కనిష్టానికి చేరింది. తాజాగా దాదాపు దశాబ్దం కనిష్టానికి చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top