యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్‌ మహీంద్ర వ్యాఖ్యలు | Coromandal ExpressAccident Anand Mahindra mourns | Sakshi
Sakshi News home page

యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్‌ మహీంద్ర వ్యాఖ్యలు

Jun 3 2023 1:38 PM | Updated on Jun 3 2023 1:52 PM

Coromandal ExpressAccident Anand Mahindra mourns - Sakshi

Odisha Train Accident: ఒడిశా పెను విషాదంపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా విచారం ప్రకటించారు. ఏకకాలంలో మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్న ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి  జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా నిశ్శబ్దంగా  ఉండిపోవాల్సిన ఒక విషాదం. ఓం శాంతి అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

“ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగనివ్వకూడదు. ఈ విషాదానికి మూలకారణాన్ని తెలుసుకోవాలి. మానవ తప్పిదమైనా లేదా సాంకేతిక తప్పిదమైనా,  ఇంత వినాశనానికి దారితీయకూడదు. రైల్వే ఆపరేషన్‌లోఫెయిల్-సేఫ్ మెకానిజమ్‌ వ్యవస్థను మరోసారి సమీక్షించుకోవాలి’’ అని ఆనంద్‌ మహీంద్ర పేర్కొన్నారు.

కాగా ఒడిశా బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 261కి చేరింది. అత్యంత ఘోరమైన ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ దుర్ఘటనపై సర్వత్రా తీవ్ర సంతాపం వెల్లు వెత్తుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement