ఆన్‌లైన్‌ మోసాలకు ఎయిర్‌టెల్‌ చెక్‌ | Airtel launched AI powered fraud detection system in Telangana | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ మోసాలకు ఎయిర్‌టెల్‌ చెక్‌

Jun 13 2025 9:00 AM | Updated on Jun 13 2025 12:48 PM

Airtel launched AI powered fraud detection system in Telangana

ఆన్‌లైన్‌ మోసాల కట్టడి చేసే దిశగా తమ ఏఐ ఆధారిత ఫ్రాడ్‌ డిటెక్షన్‌ సిస్టంను దేశవ్యాప్తంగా మరింతగా అందుబాటులోకి తెస్తున్నట్లు టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలో దీన్ని ప్రవేశపెట్టిన 25 రోజుల వ్యవధిలోనే 1,80,000 పైచిలుకు హానికారక లింకులను బ్లాక్‌ చేసినట్లు పేర్కొంది.

ఈ వ్యవస్థతో 54 లక్షల మందికి ప్రయోజనం చేకూరినట్లు వివరించింది. ఎయిర్‌టెల్‌ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లందరికీ ఇది ఆటోమేటిక్‌గా ఎనేబుల్‌ చేసినట్లు భారతి ఎయిర్‌టెల్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సీఈవో అజయ్‌ అనంతపద్మనాభన్‌ చెప్పారు. ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఈ–మెయిల్స్‌ మొదలైన వాటిల్లో వచ్చే లింకులను ఈ అధునాతన వ్యవస్థ ఫిల్టర్‌ చేస్తుందని పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: ఈపీఎఫ్‌ క్లెయిమ్‌లకు వేగంగా ఆమోదం

స్కాములను నివారించేందుకు తమ విభాగం నిరంతరం కృషి చేస్తోందని, ఎయిర్‌టెల్‌ కూడా సమర్ధవంతమైన ఫ్రాడ్‌ డిటెక్షన్‌ సొల్యూషన్‌ ప్రవేశపెట్టడం ప్రయోజనకరమైన విషయమని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ, డైరెక్టర్‌ శిఖా గోయల్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement