నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం కట్టుకాచారం వద్ద రికార్డు సమయంలో చెక్డ్యామ్ను నిర్మించగా.. ఇప్పుడు అక్కడ నీరు చేరి అలుగుపోస్తుండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కట్టుకాచారం ఏటిపై నిర్మిస్తే కట్టుకాచారాం, కొంగరతో పాటు సూర్యాపేట జిల్లా కొత్తగూడెంలోని 250 ఎకరాలకు సాగునీరు అందనుండడంతో రైతుల వినతి మేరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవ చూపారు. ఈ ఏడాది జూన్ 11న పనులు మొదలుపెట్టగా 143 మీటర్ల పొడవుతో చెక్డ్యామ్ నిర్మాణాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తిచేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెక్డ్యామ్ అలుగు పోస్తుండంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
45 రోజుల్లోనే చెక్డ్యామ్ నిర్మాణం


