సూపర్బజార్(కొత్తగూడెం): సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా ప్రధా న న్యాయమూర్తి జి.ప్రేమలత అన్నారు. లోక్ అదా లత్ విజయవంతానికి శనివారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కాంపౌండబుల్ క్రిమినల్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్, మెజిస్ట్రేట్లు బి రవికుమార్, వి.వినయ్కుమార్, పోలీస్ అధికారులు, , ఇన్సూరెన్స్ కంపెనీల స్టాండింగ్ కౌన్సిల్స్, చిట్ఫండ్ కంపెనీల ప్రతినిధులు, బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత


