
కరుణామయుడా..
● భక్తిశ్రద్ధలతో గుడ్ రౖఫైడే ● ప్రత్యేక ప్రార్థనలు, శాంతి ర్యాలీలు
పాల్వంచ/కొత్తగూడెంటౌన్: క్రీస్తును సిలువ వేసిన రోజును స్మరించుకుంటూ క్రైస్తవులు శుక్రవారం గుడ్ రౖఫైడే వేడుకలను జరుపుకున్నారు. జిల్లావ్యాప్తంగా చర్చిలు, మందిరాల్లో ప్రార్థనలు చేశారు. పలు ప్రాంతాల్లో క్రీస్తు సిలువ వేసిన ప్రదర్శనలు నిర్వహించారు. ర్యాలీలు చేపట్టారు. పలువురు గీతాలను ఆలపించారు. కొత్తగూడెంలోని సెయింట్ అండ్రుస్, బేతానియా, సెయింట్ థామస్ చర్చిలు, పాల్వంచలోని సీఎస్ఐ, ఆరోగ్య మాత చర్చిల్లో వేడుకలు జరిగాయి. పాల్వంచ ఆరోగ్యమాత చర్చి(ఆర్సీఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన సిలువ మార్గ ప్రదర్శన చూపరులను కంటతడి పెట్టించింది. చర్చి నుంచి బీసీఎం రోడ్లో సీ కాలనీ సెంటర్, అంబేద్కర్ సెంటర్, దమ్మపేట సెంటర్ మీదుగా శ్రీనివాస కాలనీ కార్మెల్ గిరి వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర ప్రదర్శన సాగింది. రాత్రి భక్తులు కార్మెల్ గుట్టకు అధిక సంఖ్యలో చేరుకుని ప్రార్థనలు చేశారు. గిడియోన్ సంస్థ ఆధ్వర్యంలో బైబిళ్లు, న్యూలైఫ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చల్లటి పానీయాలు పంపిణీ చేశారు.
చిత్రమాలిక IIవ పేజీలో