పరీక్షల్లో కొన్ని ఘటనలు.. | - | Sakshi
Sakshi News home page

పరీక్షల్లో కొన్ని ఘటనలు..

Published Sat, Mar 22 2025 12:08 AM | Last Updated on Sat, Mar 22 2025 12:07 AM

కరకగూడెం: మండల పరిధిలోని భట్టుపల్లి పాఠశాలకు చెందిన ఓ ఇద్దరు విద్యార్థినులు పరీక్ష కేంద్రానికి మండల కేంద్రం నుంచి కాలినడకన వెళ్తుంటే అటువైపుగా వెళ్తున్న ఎస్సై రాజేందర్‌ వారిని తన బైక్‌పై ఎక్కించుకున్నారు. ఆలస్యం కాకుండా పరీక్ష కేంద్రం వరకు తీసుకెళ్లారు.

ములకలపల్లి: స్థానిక జెడ్పీ హైస్కూల్‌ కేంద్రంలో గేట్‌ బయట విద్యార్థుల గదుల కేటాయింపు వివరాలతో కూడిన నోటీసు బోర్డు ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఉదయం 8.45 తరువాతే పరీక్ష కేంద్రం ఆవరణలోకి ఆనుమతించడం, 8.50కి గదుల్లోకి ప్రవేశించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement