ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం

Mar 18 2025 12:42 AM | Updated on Mar 18 2025 12:40 AM

మణుగూరు రూరల్‌: విద్యుత్‌ ఉద్యోగుల సంక్షేమానికి జెన్‌కో సంస్థ ప్రాధాన్యమిస్తోందని భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ సీఈ బి.బిచ్చన్న తెలిపారు. తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(టీఎస్‌పీఈయూ)–1535 వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకుంటూ అధిక ఉత్పత్తికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి.ప్రసాద్‌, ఆర్‌.రామచందర్‌, ఎం.రాజమనోహర్‌, ఎస్‌డి రఫీ, టి.అనిల్‌కుమార్‌, ఎ.వెంకటేశ్వర్లు, జార్జ్‌, పుల్లారావు, జి రవికుమార్‌, వీరబాబు, వింజమూరు మురళి, చిక్కా వెంకటరమణ, ఆర్‌.రవిచంద్ర, జానీ బేగం, ఈశ్వరి, సునీత తదితరులు పాల్గొన్నారు.

బీటీపీఎస్‌ సీఈ బిచ్చన్న

Advertisement
 
Advertisement
Advertisement