చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Jul 19 2023 12:12 AM | Updated on Jul 19 2023 9:08 AM

- - Sakshi

భద్రాద్రి: అశ్వాపురం మండలంలోని జగ్గారం క్రాస్‌ రోడ్డు వద్ద మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మణుగూరు డిపోకు చెందిన బస్సు మణుగూరు నుంచి ఖమ్మం వెళ్తోంది.

జగ్గారం క్రాస్‌ రోడ్డు సమీపంలో మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారిపై బస్సుకు ఎద్దు అడ్డు రావడంతో తప్పించబోయి అదుపుతప్పి రహదారి కిందకు దిగి చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులెవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement