వేటపాలెం: స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎస్ఐఆర్ఐ స్పెషన్ డ్రైవ్పై కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ విడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్ష నిర్వహించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రతి పోలింగ్ బూత్ సర్ ప్రక్రియపై నిర్వహిస్తున్న పకబ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల వివరాల పరిశీలన, 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్, నోటీసుల జారీ, విచారణ, ఫారం–6,7,8 దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జేసీ భావన, డీఆర్ఓ లవన్న తోపాటు, ఈఆర్ఓలు, ఏఆఆర్ఓలు, అదనపు ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, డీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, ప్లానింగ్ సెక్రటరీ, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


