ముగిసిన చెన్నకేశవ బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన చెన్నకేశవ బ్రహ్మోత్సవాలు

Mar 6 2026 8:24 AM | Updated on Mar 6 2026 8:24 AM

ముగిసిన చెన్నకేశవ బ్రహ్మోత్సవాలు పారా లీగల్‌ వలంటీర్లకు దరఖాస్తుల ఆహ్వానం ● దరఖాస్తు చేసుకునేవారు మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణులై, సంపూర్ణ గ్రహణశక్తి, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని చెప్పారు. ● గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కమిటీచే ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థుల ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. ● అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలు, మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబర్‌, ఫొటో, 10వ తరగతి సర్టిఫికెట్‌, కుల ధృవీకరణ పత్రం కాపీలను దరఖాస్తులో జతజేసి ఈ నెల 12వ తేదీ లోపు పంపాలన్నారు. దరఖాస్తును రేపల్లె మండల న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో స్వయంగా గాని, పోస్ట్‌ ద్వారాగాని, ఫైలింగ్‌ బాక్స్‌లోగాని అందించవచ్చన్నారు.

చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న చెన్నకేశస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగి గురువారం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. ప్రాంగణంలో ఆంజనేయ, మహావిష్ణు, హోమ కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి హోమం పూర్తి చేశారు.కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన బోయిన వెంకన్న బృందంచే నాదస్వర కచేరి నిర్వహించారు. ఖాజీపాలెం గ్రామానికి చెందిన హరిహర భక్త సమాజం వారిచే నామ సంకీర్తన కార్యక్రమాలు జరిపించారు. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌ ఎండూరి సాయిగుప్తా, ఈవో నరసింహమూర్తి పాల్గొన్నారు.

రేపల్లె: పారా లీగల్‌ వలంటీర్ల నియామకానికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సీనియర్‌ సివిల్‌ జడ్జి వెన్నెల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement